Fire Accident Sb Main Branch Secunderabad

Fire Accident : సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు , స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్దమైనట్లు సమాచారం. ఆదివారం సెలవు రోజై ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బిల్డింగ్‌లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది.

Riyan Parag: 2023లో చెప్పాడు, 2025లో బాదాడు.. రియాన్ పరాగ్ తోపెహే!

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by Ntvtelugu website. This website is not to be held responsible for any of the content displayed.